Pahalgam aftermath: మోదీ సర్కారుకు పూర్తి మద్దతు: ఖర్గే, రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:02 PM
పహల్గాం దాడికి ప్రతీకారంగా అనుసరించాల్సిన వ్యూహంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం భేటీ ముగిసింది. రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో..

Pahalgam aftermath: పహల్గాం దాడికి ప్రతీకారంగా అనుసరించాల్సిన వ్యూహంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం భేటీ ముగిసింది. రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో ఉగ్ర దాడి ఘటనను అఖిలపక్షానికి వివరించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్. ప్రభుత్వ చర్యలకు మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ చెప్పారు. కాశ్మీర్లో శాంతి నెలకొనాలని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ ఉగ్రదాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై కేంద్రం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. "పహల్గామ్ ఉగ్రవాద దాడిని అందరూ ఖండించారు. ఏదైనా చర్య తీసుకోవడానికి ప్రతిపక్షం ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చింది" అని రాహుల్ సమావేశం తర్వాత మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, అన్ని పార్టీలు ఈ దారుణమైన దాడిని ఖండించాయని, జమ్మూ కాశ్మీర్లో శాంతిని కాపాడటానికి కృషి చేయాలని అన్నారు. "అన్ని పార్టీలు దాడిని ఖండించాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతిని కాపాడటానికి ప్రయత్నాలు జరగాలని మేము చెప్పాము" అని ఖర్గే అన్నారు.
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం భేటీకి హోంమంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి జైశంకర్, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు హాజరయ్యారు. వీరితోపాటు ఖర్గే, రాహుల్, శ్రీకృష్ణదేవరాయలు, అసదుద్దీన్ ఒవైసీ సహా వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన 26 మందికి అఖిలపక్షం నివాళులు అర్పించింది. ఇలా ఉండగా, రేపు జమ్మూకశ్మీర్లో రాహుల్గాంధీ పర్యటించబోతున్నారు.
Pahalgam Terror Attack: వీసాల రద్దు.. సీమా హైదర్ పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనా..
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..