Home » New Delhi
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
తెలంగాణ కులగణన దేశానికే రోల్మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇది తన శపథమని అన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలని, తమ శక్తిని తాము తెలుసుకోకపోవడమే కొందరి సమస్యని అన్నారు.
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు.
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇండియా కూటమి కింద 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్షాప్లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్లో పర్యటించారు. 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్ఫెక్షన్ బారినపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే 'బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్- రాజ్యాంగ సభ-భారత రాజ్యాంగం' పేరిట ఒక పోస్టల్ కవర్ను విడుదల చేశారు.
హత్య చేసిందన్న నేరంపై యెమెన్ దేశంలో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ 36 కేసు చివరి నిమిషంలో మలుపు తిరిగింది.
ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియే దేశం బహిరంగంగా పాకిస్థాన్కు మద్దతిచ్చింది. ఈక్రమంలోనే బీసీఏఎస్ మే 15న భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్యూరిటీ అనుమతిని రద్దు చేసింది.