Home » New Delhi
Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.
టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.
కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.
విమానయాన రంగంతోపాటు అంతర్జాతీయ సహకారం, వాతావరణ కట్టుబాట్లు, సమానమైన వృద్ధి ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే వేదికగా ఈ సదస్సు ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరంద్ర మోదీ ఆకాంక్షించారు
పాక్ నిఘా ఏజెంట్లకు భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తాజా అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా భారత రక్షణ రంగ మౌలిక వసతుల సమాచారాన్ని సేకరించేందుకు పాక్ ఏజెంట్లు ఈ సిమ్లు వాడుతున్నట్టు గుర్తించారు.
పార్లమెంటుకు సమీపంలోని హై-సెక్యూరీటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.