Ayodhya: రామలయం దర్శనం, హారతి వేళల్లో సవరణ
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:32 PM
భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆలయ దర్శనం,హారతి వేళల్లో సవరణ చోటుచేసుకుంది.

అయోధ్య: అయోధ్యలోని రామాలయ (Ayodhya Ram Temple) దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం, భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఫిబ్రవరి 6 నుంచి సవరించిన వేళలు అమల్లోకి రానున్నాయి.
Hema Malini: తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, బూతద్దంతో చూడకూడదు
మారిన దర్శనం, ఆరతి వేళలు ఇవే..
-మంగళహారతి : ఉదయం 4 గంటలకు (హారతి తర్వాత ద్వారాలు మూసేస్తారు)
-శ్రింగార్ హారతి, భక్తులకు దర్శన ప్రారంభం: ఉదయం 6 గంటల నుంచి
-రాజ్ భోగ్ ఆఫరింగ్: మధ్యాహ్నం 12 గంటలకు (భోగ్ సమయంలో దర్శనం కొనసాగింపు)
-సంధ్యా హారతి: రాత్రి 7 గంటలకు (ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసేస్తారు)
-శయన హారతి : రాత్రి 10 గంటలకు (హారతి తర్వాత ద్వారాలు మూసివేస్తారు)
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి