Home » Ayodhya Ram mandir
శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది.
ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రత్యేకతలు ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి.
అయోధ్యలోని రామ మందిరం ఇటీవల బాంబు బెదిరింపునకు గురైంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయ భద్రత, అప్రమత్తతను పరీక్షించడానికి, భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భతం ఆవిష్క్రుతమైంది. సూర్యకిరణాలు నేరుగా బాల రాముడి నుదుటిపై పడడాన్ని తిలకించిన భక్తలు పులకించిపోయారు.
మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య బాల రాముడి దర్శనార్థం వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన, నిష్క్రమణ ద్వారాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ కమిటీలోని ముఖ్య సభ్యులందరూ నేడు ఆలయాన్ని పరిశీలించి చర్యలు చేపడతారని చెప్పారు.