Share News

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 06:10 AM

పాక్‌ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్‌ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్‌ చేసింది.

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

జైసల్మేర్‌, మే 29: పాక్‌ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్‌ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్‌ చేసింది. జైసల్మేర్‌లోని ఆయన ఆఫీసులోనే సకూర్‌ఖాన్‌ మంగళియార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తదుపరి విచారణకు జైపూర్‌కు తరలించనున్నారు.


అతడికి కాంగ్రెస్‌ నేతలతో సంబంధం ఉందని, గత ప్రభుత్వంలో ఆ పార్టీ నేతకు సహాయకుడిగా పని చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ సరిహద్దు గ్రామ వాసి సకూర్‌ఖాన్‌ ఫోన్‌లో పలువురు పాక్‌ పౌరుల ఫోన్‌ నంబర్లున్నాయి. తమ ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

Updated Date - May 30 , 2025 | 06:10 AM