Indian Railways: రద్దు చేసిన రైలు టికెట్లపై రీఫండ్ పెంపు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:54 AM
రైలు టికెట్లను రద్దు చేసినప్పుడు ఇచ్చే రీఫండ్ మొత్తాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది.

న్యూఢిల్లీ, జూలై 6: రైలు టికెట్లను రద్దు చేసినప్పుడు ఇచ్చే రీఫండ్ మొత్తాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది. టికెట్లపై ‘క్లర్కేజీ’ చార్జీ తగ్గింపు లేదా పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తోంది. వెయింటింగ్ లిస్టు, ఆర్ఏసీ టికెట్లను రద్దు చేసుకున్నప్పుడు ఈ చార్జీలు మినహాయించుకొని ప్రయాణికులకు డబ్బులు వాపసు ఇస్తున్నారు.