Share News

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:46 PM

జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

పాట్నా: బీపీఎస్‌సీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై నిరాహార దీక్ష చేపట్టి, అరెస్టయిన జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ (Prashant Kumar)కు పాట్నా కోర్టు ఎలాంటి షరతులు లేకుండా బెయిలు మంజూరు చేసింది. తొలుత ఆయన దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. అనంతరం సవిల్ కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో బెయిల్ పొందేందుకు కిషోర్ నిరాకరించారు. జైలుకు వెళ్లేందుకే సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో ఆయనకు బేషరతుగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Bharatpol: సీబీఐ 'భారత్‌పోల్' పోర్టల్‌తో ఇక నేరస్థుల ఆటకట్టు


అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ''2 గంటల క్రితం పోలీసులు నన్ను జైలుకు తీసుకువళ్లారు. కోర్టు నా డిమాండ్‌ను అంగీకరించి బేషరతుగా బెయిల్ మంజూరు చేసింది. ప్రజాబలానికి మించిన బలం ఏదీ లేదు. ప్రజల కోసం మేము చేసిన పోరాటం ఫలితమే ఈ పరిణామం'' అని అన్నారు.


నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు

దీనికి ముందు, గాంధీమైదాన్‌లో సోమవారం ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ప్రశాంత్ కిషోర్‌ను పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. ఆంక్షలున్న ప్రదేశంలో ప్రదర్శనలకు అనుమతి లేనందునే కిషోర్‌ను, ఆయన మద్దతుదారులను దీక్షా స్థలి నుంచి తరలించినట్టు పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్‌సీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జనవరి 2 నుంచి జన్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కిషోర్‌ దీక్షా శిబిరం నుంచి తొలగించేటప్పుడు ఆయనపై చేయి చేసుకున్నారని, కొట్టారని ఆయన మద్దతుదారులు చేసిన ఆరోపణను జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తోసిపుచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనపై చేయి చేసుకోలేదని, ఆయనను అరెస్టు చేయకుండా అడ్డుపడిన మద్దతుదారులను నిరసన స్థలి నుంచి ఖాళీ చేయించారని చెప్పారు. ఈ సందర్భంగా 43 మంది మద్దతుదారులను అరెస్టు చేసి మూడు ట్రాక్టర్లతో సహా 15 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. బీపీఎస్‌సీ పరీక్షల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందుందని, ఎవరైనా తమ వాదనలు వినిపించాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 09:47 PM