BJP: బీజేపీ కూటమిలోకి పీఎంకే, డీఎండీకే
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:48 AM
బీజేపీ కూటమిలో పీఎంకే, డీఎండీకే వస్తాయనే నమ్మకం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగంద్రన్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మదురై ఒత్తకడైలో జరుగనున్న బీజేపీ సమావేశంలో పాల్గొననున్నారు.

- నయినార్ నాగేంద్రన్
చెన్నై: బీజేపీ(BJP) కూటమిలో పీఎంకే, డీఎండీకే వస్తాయనే నమ్మకం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగంద్రన్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మదురై ఒత్తకడైలో జరుగనున్న బీజేపీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(Nayinar Nagendhar) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షా శనివారం రాత్రి మదురై చేరుకుంటారని, ఆదివారం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారని, అనంతరం రాష్ట్ర నాయకుల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
మదురైలో కేంద్ర మంత్రి అమిత్ పాల్గొనే సమావేశంలో కూటమి పార్టీలు పాల్గొనడం లేదన్నారు. అమిత్షా-అన్బుమణి భేటీపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సామరస్యం అనే విషయమై తమకు నమ్మకం ఉందన్నారు. కానీ, రాందా్స-అన్బుమణి మధ్య జరుగుతున్న సామరస్య చర్చలతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో మంచి విషయాలు జరగాలని గురుమూర్తి ఆశిస్తున్నారని, ఆయన ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తారన్నారు. డీఎంకేకు షా అంటే భయమని, మహారాష్ట్రలో బీజేపీ అధికారం చేపట్టడం వెనుక కేంద్రమంత్రి అమిత్ షా కృషి ఎంతో ఉందని నయినార్ నాగేంద్రన్ గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News