Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ
ABN , Publish Date - May 04 , 2025 | 09:45 PM
తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.

న్యూఢిల్లీ: భారతదేశంలో క్రీడలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. భారతదేశం క్రమంగా పటిష్ట క్రీడా సంస్కృతి దిశగా పురోగమిస్తోందన్నారు. ఎంతగా క్రీడా సంస్కృతి విస్తరిస్తుందో, అంతగా ఇండియా సాఫ్ట్ పవర్ పెరుగుతుందని, ఎంత ఆడితే అంత షైన్ అవుతారని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు. పాట్నాలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Rajnath Singh: వదిలిపెట్టం.. ప్రజాభీష్టమే నెరవేరుతుంది: రాజ్నాథ్ సింగ్
బీహార్ క్రీడా ప్రతిభను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన యంగ్ క్రికెటర్ సూర్యవంశీ ఆటతీరును హైలైట్ చేస్తూ, వైభవ్ విజయం వెనుక అతని అంకితభావం ఉందని, క్రీడాకారులు వివిధ స్థాయిలో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా రాణిస్తారని అన్నారు.
జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడికి క్రీడలు దోహదం చేస్తాయని, బీహారేతరులు కూడా ఈ క్రీడల్లో పాల్గొని బీహార్ సమున్నత సంస్కృతిని, మధురమైన వంటకాలను ఆస్వాదించాలని అన్నారు. ''మీరు గ్రౌండ్లో క్రీడాకారులు మాత్రమే కాదు, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అంబాసిడర్లు కూడా '' అని పేర్కొంటూ అధికారికంగా క్రీడలు ప్రారంభమైనట్టు ప్రధాని ప్రకటించారు. పాట్నా, భగలత్పూర్, రాజ్గిర్ సహా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 6,000కు పైగా క్రీడాకారులు మే 15వ తేదీ వరకూ జరిగే ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News