Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్కు లేఖలు!
ABN , Publish Date - Jun 07 , 2025 | 10:39 AM
మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

భారత్ మీదకు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్.. ఇప్పుడు మన దేశం పేరు చెబితే వణుకుతోంది. ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు మూడు చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడుతోంది పాక్. దీనికి తోడు సింధూనది జలాల ఒప్పందాన్ని మోదీ సర్కారు నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాగునీరు, సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాక్.. వేరే ఆప్షన్ లేకపోవడంతో కాళ్లబేరానికి వస్తోంది. దేహీ అంటూ భారత్కు 4 లేఖలు రాసింది. సింధూనది జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని కోరుతూ లెటర్స్ రాసింది శత్రుదేశం. ఇందులో ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా.. మిగతా మూడు కూడా ఆపరేషన్ సిందూర్ అనంతరం రాసినట్లు సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మేం సిద్ధం..
భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి 4 లేఖలు అందాయని తెలుస్తోంది. సింధూ జలాలను నిలిపివేయడంతో తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ ఈ లేఖల్లో పాక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశం మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ లేఖల్లో శత్రుదేశం పేర్కొంది. పాక్ జలవనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖల్ని ప్రోటోకాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఉగ్రవాదం-వాణిజ్యం కలసి వెళ్లలేవని, నీరు-రక్తం కలసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండడోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నీళ్లు వదలండి అంటూ పాక్ నుంచి లేఖలు రావడం ఆసక్తిని సంతరించుకుంది. దీనిపై కేంద్ర సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి