Share News

Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం

ABN , Publish Date - May 05 , 2025 | 06:29 PM

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. అనంతరం బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు.

Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం

హమీర్‌పూర్: భారత సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత వ్యతిరేక కార్యకలాపాల కొనసాగిస్తూ పోతే ఆదేశాన్ని ప్రపంచ పటం నుంచి నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు, పహల్గాం ఉగ్రదాడికి గట్టి జవాబిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇండియాలో నివసిస్తున్న పాక్ పౌరులను గుర్తించి పాకిస్థాన్‌కు పంపాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. అయితే, బీజేపీయేతర రాష్ట్రాల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Putin vows full support to India: భారత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..


పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. అనంతరం బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. రాష్ట్రంలో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమొరాండం సమర్పించారు.


కాగా, రాష్ట్రంలో నివసిస్తున్న పాక్ జాతీయులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, వెనక్కి పంపకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ "జాగరణ్ అభియాన్'' చేపడుతుందని హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ చెప్పారు. పాకిస్థాన్‌ను కల్పిస్తున్న సౌకర్యాలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ఒకవైపు మద్దతిస్తూనే మరోవైపు ఆ పార్టీ నేతలు బాధిత్యారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 06:34 PM