Devendra Fadnavis: పాక్కు దొంగదెబ్బే తెలుసు.. నేరుగా ఏ యుద్ధంలోనూ గెలవలేదు
ABN , Publish Date - May 12 , 2025 | 05:33 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సాయుధ బలగాలు పాక్ను మట్టికరిపించాయని, ఉగ్రవాద శిబిరాలు, సాయుధ బలగాల స్థావరాలను ధ్వంసం చేశాయని ఫడ్నవిస్ తెలిపారు. పాకిస్తాన్ను ప్రాక్సీ వార్ మాత్రమే తెలుసునని, మనతో నేరుగా పోరాడి గెలిచిన చరిత్రేలేదని పేర్కొన్నారు.

ముంబై: పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) విరుచుకుపడ్డారు. పరోక్ష యుద్ధం చేయడమే పాక్కు తెలిసిన విద్య అని, ఇండియాతో చేసే ఏ యుద్ధంలోనూ పాక్ గెలవలేదని అన్నారు. పాక్ పరోక్ష యుద్ధానికి దిగితే ఆ ప్రభావం దేశ ఆర్థిక రాజధాని ముంబైపై ఉంటుందన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడటం, పాక్ ప్రతిపాదనతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఫడ్నవిస్ తాజా వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ముంబై భద్రతకు సంబంధించి సివిల్-మిలటరీ కోఆర్డినేషన్పై ఫడ్నవిస్ తన అధికారిక నివాసం వర్షలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం హాజరయ్యారు. కాగా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని యుద్ధం తరహా పరిస్థితి నెలకొనడంతో ఇంతకుముందు కూడా వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు హోం మంత్రిగా కూడా ఉన్న ఫడ్నవిస్ తెలిపారు. ఈరోజు భారత సాయుధ బలగాలకు చెందిన అధికారులతో సమావేశం జరిపినట్టు చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సాయుధ బలగాలు పాక్ను మట్టికరిపించాయని, ఉగ్రవాద శిబిరాలు, సాయుధ బలగాల స్థావరాలను ధ్వంసం చేశాయని ఫడ్నవిస్ తెలిపారు. పాకిస్తాన్ను ప్రాక్సీ వార్ మాత్రమే తెలుసునని, మనతో నేరుగా పోరాడి గెలిచిన చరిత్రేలేదని పేర్కొన్నారు. పాక్ దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరిపినప్పుడల్లా ముంబై రక్షణకు జాగ్రతలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫడ్నవిస్ అధ్యక్షతన జరిగిన ఆర్మీ అధికారుల సమావేశంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాత సౌనిక్, డీజీపీ రష్మి శుక్లా తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్కు వార్నింగ్..
For National News And Telugu News