Home » Chief Minister
జమ్మూకాశ్మీర్లో అన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రితో తాను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభం కాగా, రెండవసారి బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభంలో పాల్గొన్నానని తెలిపారు.
చినాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారని, అప్పుడు యావద్దేశం సాయుధ బలగాలకు అండగా నిలుస్తుందని ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సాయుధ బలగాలు పాక్ను మట్టికరిపించాయని, ఉగ్రవాద శిబిరాలు, సాయుధ బలగాల స్థావరాలను ధ్వంసం చేశాయని ఫడ్నవిస్ తెలిపారు. పాకిస్తాన్ను ప్రాక్సీ వార్ మాత్రమే తెలుసునని, మనతో నేరుగా పోరాడి గెలిచిన చరిత్రేలేదని పేర్కొన్నారు.
రాత్రి సమయంలో ఢిల్లీకి బయలుదేరిన తన విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై జైపూర్కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సామాజిక మధ్యామాల్లో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జైపూర్లో విమానం దిగిన తర్వాత మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.
మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్థాకరే ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని అన్నారు.
రాష్ట్రాల హక్కులను డిమాండ్ చేయడంలో తప్పేముందని స్టాలిన్ ప్రశ్నించారు. గత్యంతరం లేకనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు కారణంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామని, అత్యున్నత న్యాయస్థానం దానిపై చారిత్రక తీర్పునిచ్చిందని చెప్పారు.
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.