Home » Chief Minister
రాత్రి సమయంలో ఢిల్లీకి బయలుదేరిన తన విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై జైపూర్కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సామాజిక మధ్యామాల్లో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జైపూర్లో విమానం దిగిన తర్వాత మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.
మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్థాకరే ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని అన్నారు.
రాష్ట్రాల హక్కులను డిమాండ్ చేయడంలో తప్పేముందని స్టాలిన్ ప్రశ్నించారు. గత్యంతరం లేకనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు కారణంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామని, అత్యున్నత న్యాయస్థానం దానిపై చారిత్రక తీర్పునిచ్చిందని చెప్పారు.
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు.
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
నీట్పై రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని ఎంకే స్టాలిన్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.