Share News

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

ABN , Publish Date - May 07 , 2025 | 11:29 AM

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్
Operation Sindoor

న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడికి దిగింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ను నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్‌లో దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. అనేక విమానాలు రద్దు అయ్యాయి. శ్రీనగర్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో కార్యకాలపాలను మూసివేశారు.


పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.


ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ స్టేషన్లకు బయలు దేరే అన్ని విమానాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అలాగే అమృత్‌సర్‌కు వెళ్తున్న రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించారు.


విమానాల రద్దుపై ట్విట్టర్‌లో స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. ‘ఈ ఊహించని అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ధర్మాశాల, లేహ్, జమ్ము, శ్రీనగర్, అమృత్‌సర్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ విమానాశ్రయాల ద్వారా వెళ్లే విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండిగోకు చెందిన 160 దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 20 విమానాలు రద్దు అయినట్లు అధికారులు ప్రకటించారు.


ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్‌లకు వెళ్లే విమానాలను నేడు రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాలు మూసివేయబడతాయని ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

Operation Sindoor: పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

Read Latest National News And Telugu News

Updated Date - May 07 , 2025 | 01:54 PM