Home » Indigo
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వలన శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు రెండు గంటలపాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత విమానం ఆలస్యంగా గోవాకు బయలుదేరింది
రాత్రి సమయంలో ఢిల్లీకి బయలుదేరిన తన విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై జైపూర్కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సామాజిక మధ్యామాల్లో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జైపూర్లో విమానం దిగిన తర్వాత మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.
విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.
ఇండిగో విమాన సిబ్బందిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇండిగో మహిళా సిబ్బంది ఒకరు ఐదేళ్ల వయసున్న చిన్నారి మెడలోంచి బంగారు నెక్లెస్ దొంగిలించదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Indigo Flight: సౌదీ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికులు హల్చల్ చేశారు. దీంతో సహచర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. విమానంలోని అత్యవసర తలుపును తీసేందుకు అతడు ప్రయత్నించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానం ల్యాండ్ కాగానే.. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రయాగ్రాజ్కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు.
ఇండిగో ఎయిర్లైన్స్కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఓ సంస్థ ప్రమాణాలు పాటించడం లేదని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ (సీఎ్ఫఎస్)తెలంగాణ టాస్క్ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.
Vijayawada: గన్నవరం ఎయిర్పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్కు సిగ్నల్ అందక ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్బస్ సర్వీసు మొదలవుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు చెప్పారు.