Home » Indigo
ఇండిగోపై సీసీఐ కూడా దృష్టి సారించింది. మార్కెట్లో తనకున్న ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరిచిందో లేదో తేల్చేందుకు ప్రాథమిక స్థాయిలో పరిశీలన చేపట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తీవ్ర సంక్షోభ పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్న ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇటీవల రద్దైన విమాన సర్వీస్ ప్రయాణికులకు రూ.10వేల వరకూ పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
దేశ విమానయాన రంగంలో సంక్షోభం సృష్టించిన ఇండిగో వ్యవహారంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంక్షోభంపై మంగళవారం లోక్సభలో మాట్లాడారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు.
ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. ప్రయాణీకులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా ఏకంగా 90కిపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇండిగో విమానం మార్గమధ్యంలో ఉండగా లోపలి ప్రయాణికులకు ఓ పావురాయి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. విమానం క్యాబిన్ లోపల పావురాయి ఎగరడాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు.
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది.