Ooty: పుష్ప ప్రదర్శనకు ఊటీ ముస్తాబు
ABN , Publish Date - May 14 , 2025 | 12:22 PM
ఊటీలో పుష్ప ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. గురువారం నుంచి పుష్ప ప్రదర్శన జరగనుంది. ఈ సందర్బంగా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కాగా... ఊటీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్ గార్డెన్లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు.

- ఉత్సాహంగా పడవల పోటీ
- రేపు నీలగిరి జిల్లాకు సెలవు
చెన్నై: రాష్ట్రంలో పర్వతశ్రేణులపై పచ్చదనం, చల్లటి వాతావరణ సంతరించుకున్న వేసవి విడిది ప్రాంతమైన ఊటీ పుష్ప ప్రదర్శనకు ముస్తాబయ్యింది. గురువారం బొటానికల్ గార్గెన్(Botanical Garden)లో 127వ పుష్ప ప్రదర్శనను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నీలగిరి జిల్లాలో కలెక్టర్ లక్ష్మీభవ్య స్థానిక సెలవు ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: సీఎం స్టాలిన్ ధీమా.. ఆ కూటమితో మాకేం నష్టం లేదు..
దీనికి బదులు ఈ నెల 31వ తేదీ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఆమె తెలిపారు. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్ గార్డెన్లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు. ఇన్కా మేరీగోల్డ్, ఫ్లగ్స్, బెటూనియా, ఫాన్సీ, డయాంతస్, బికోనియా, డేలియో, పాల్సం, రెనన్ ప్లస్, వయోలా, అజరేటం, కాలండులా, గ్లాడియోలస్, విలియం,
సన్ఫ్లవర్ వంటి అరుదైన పుష్పాలు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇదిలా వుండగా వేసవి సీజన్ను పురస్కరించుకుని ఊటీ(Ooty) సరస్సులో పర్యాటకుల్లో ఉత్సాహం నింపేలా సోమవారం ప్రభుత్వ పర్యాటకశాఖ పడవల పోటీ నిర్వహించింది. ఇందులో పాల్గొని తొలి మూడు స్థానాలకు చేరుకున్న పర్యాటకులకు బహుమతులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News