Share News

Chennai: ఎమ్మెల్యే అయితేనేం.. రూలంటే రూలేమరి..

ABN , Publish Date - May 24 , 2025 | 02:00 PM

హెల్మెట్‌ ధరించని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసులు జరిమానా విధించారు. తమిళనాడు రాష్ట్రం విలవంగోడు మహిళా ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్‌ హెల్మెట్‌ ధరించకుండా బైక్ నడిపారంటూ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు.

Chennai: ఎమ్మెల్యే అయితేనేం.. రూలంటే రూలేమరి..

- హెల్మెట్‌ ధరించని ఎమ్మెల్యేకు జరిమానా..

చెన్నై: ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ లేకుండా వెళ్లిన మహిళా ఎమ్మెల్యేకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేది కన్నియాకుమారి జిల్లా పంగల్‌ జంక్షన్‌ నుంచి కుళిత్తురై జంక్షన్‌ వరకు రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కిల్లియూర్‌ ఎమ్మెల్యే రాజేష్‏కుమార్‌, విలవంగోడు మహిళా ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్‌ సహా కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.


zzzzzzzzzzzzzzzzzzz.jpg

కాగా, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్‌ సహా కొందరు హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనంపై కాంగ్రెస్‌ జెండా ఉంచి పాల్గొన్నారు. ఈ క్రమంలో, హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనంపై వెళ్లిన మహిళా ఎమ్మెల్యేకు ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 02:00 PM