Share News

Neet UG 2025: నీట్ UG 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్ట్ స్టే..

ABN , Publish Date - May 17 , 2025 | 07:04 PM

NEET 2025 Results Hold: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీ 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు పరిశీలించిన అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మళ్లీ ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయంటే..

Neet UG 2025: నీట్ UG 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్ట్ స్టే..
Madras HC vs NTA NEET 2025

Madras HC vs NTA NEET 2025: మద్రాస్ హైకోర్ట్ (Madras High Court) NEET-UG 2025 పరీక్షా ఫలితంపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకూ ఫలితాలు విడుదల చేయవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలోని అవడి పరీక్షా కేంద్రంలో విద్యుత్ అంతరాయం కారణంగా రాయడంలో ఇబ్బంది ఎదురైందని విద్యార్థులు ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.


తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వెలుతురు లేకపోయినా పరీక్ష రాయాల్సి వచ్చిందని 13 మంది విద్యార్థులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నీట్ ఫలితాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలు ఇప్పుడే వెల్లడి చేయొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశిస్తూ జూన్ 2వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఇండోర్ బెంచ్ సైతం నీట్ యూజీ 2025 ఫలితాల ప్రకటనపై తాత్కాలిక స్టే విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ), కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ వెస్ట్ జోన్ విద్యుత్ పంపిణీ కంపెనీకి నోటీసు జారీ చేసింది.


గతంలో కూడా పేపర్ లీక్ లు, ఇతర అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వివాదం నీట్ ఫలితాలు ఆలస్యానికి కారణం అవుతోంది. దీంతో నీట్ పరీక్ష విశ్వసనీయతపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి సంఘటనలు వైద్య ప్రవేశ పరీక్ష ప్రక్రియపై విశ్వాసాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. కాగా, అందరి కళ్లూ కోర్టు తుది నిర్ణయంపైనే ఉన్నాయి.


NTA మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో NEET UG 2025 పరీక్షను నిర్వహించింది. 23 లక్షల మంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, తదుపరి ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Read Also: Big Blow to AAP: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

US Embassy Warning: భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధం విధిస్తామంటూ వార్నింగ్

Viral News: షాకింగ్.. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని..ఇంటికెళ్లి వేసుకున్న 32 ఏళ్ల మహిళ, తర్వాత మృతి

Updated Date - May 17 , 2025 | 08:09 PM