Flight Emergency landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , Publish Date - May 06 , 2025 | 09:23 PM
ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్ నుంచి మాస్కోకు బయలుదేరిన ఎస్యూ 273 విమానంలో పొగలు కనిపించడంతో ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
IAF Air Exercise NOTAM Issued: సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు. 425 మంది ప్రయాణికులతో ఉన్న విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానం సేఫ్టీ ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయి. విమానంలో పొగలు రావడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
PM Modi: బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..