Chennai: కొడనాడు ఎస్టేట్ కేసులో సీబీసీఐడీ విచారణకు రమేష్
ABN , Publish Date - May 23 , 2025 | 01:20 PM
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్లో వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.

చెన్నై: నీలగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) వేసవి విడిది కేంద్రమైన కొడనాడు ఎస్టేట్లో 2017లో జరిగిన వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్న సీబీసీఐడీ.. ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్(Atnoor Ravi) ను గురువారం విచారించారు.
కొడనాడు కేసులకు సంబంధించి కేరళకు చెందిన మనోజ్, సయాన్, సతీషన్, సంతోష్ సామి, మనోజ్సామి సహా 10మందిని అరెస్టు చేశారు. ఈ కేసులపై ఊటీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులతో సంబంధం కలిగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ కనకరాజ్. సోదరుడు ధనపాల్ను విచారించే సమయంలో సేలం జిల్లా ఆత్తూరుకు చెందిన రమేష్ సాక్ష్యాలను చెరిపేందుకు ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు.
ధనపాల్, రమేష్ తదితరులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆత్తూరు రమేష్కు విచారణకు హాజరుకావాలంటూ సీబీసీఐడీ పోలీసులు సమన్ జారీ చేశారు. ఆ మేరకు గురువారం ఉదయం కోవైలో ఉన్న సీబీసీఐడీ కార్యాలయంలో ఆత్తూరు రమేష్ విచారణకు హాజరయ్యారు. కొడనాడు కేసులకు సంబంధించి ఇప్పటివరకూ సీబీసీఐడీ పోలీసులు సుమారు500 మందిని విచారించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News