Bengaluru: ఆ రెండు పథకాలను వారికి రద్దు చేస్తాం..
ABN , Publish Date - May 29 , 2025 | 12:35 PM
ఆ రెండు పథకాలను వారికి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజరాయరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల్లో కొందరు అనర్హులున్నట్లు గుర్తించామన్నారు.

- అనర్హులకు గృహలక్ష్మి, గృహజ్యోతి రద్దు
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీల్లో కీలకమైన గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల అనర్హులైన లబ్ధిదారులకు జూలైనుంచి రద్దు చేస్తున్నట్లు సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజరాయరెడ్డి(Basavarajarayareddy) తెలిపారు. కొప్పళ జిల్లా కుకనూరు పట్టణ అతిథిగృహంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్యారెంటీ పథకాల్లో అనర్హులైన లబ్ధిదారులకు లాభం కలుగుతోందన్నారు. సర్వేలు జరిపి అనర్హులను తొలగించదలిచామన్నారు. ఒక శాసనసభ నియోజకవర్గానికి ఏడాదికి గ్యారెంటీ పథకాల ద్వారా రూ.250 కోట్లు చేరుతోందన్నారు.
పథకం ప్రజల చెంతకు వెళ్తోందని, అయితే అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలుగా అధికారులను ఏర్పాటు చేసి నియంత్రించాలని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు వివరిస్తానన్నారు. ఇళ్లు బాడుగకు ఇచ్చినవారికి గృహజ్యోతి వర్తిస్తోందన్నారు. గృహలక్ష్మి పథకం జీఎస్టీ, ఇన్కమ్ట్యాక్స్ చెల్లించేవారికి వెళ్తుందోన్నారు. సమగ్రంగా సర్వే జరిపి అర్హులకు మాత్రమే గ్యారెంటీలు అందాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News