Share News

Karnataka Stampede: 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది.. మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jun 04 , 2025 | 08:39 PM

ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు.

Karnataka Stampede: 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది.. మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది మృతి చెందడం, 47 మంది గాయపడటంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (Siddaramaiah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యసాయం అంజేస్తామన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను సీఎం పరామర్శించారు.


అనంతరం సిద్ధరామమయ్య మాట్లాడుతూ, కేవలం 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మందికి పైగా జనం రావడంతో ఈ ఘటన జరిగిందని సీఎం చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్టు చెప్పారు. ఇది ఎవరూ ఊహించని విషాదమని, ప్రభుత్వం కానీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఇంత పెద్దఎత్తున జనం వస్తారని ఊహించలేదని అన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు చెప్పారని సీఎం తెలిపారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ కమిషన్ స్థాయిలో విచారణ జరపనున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

షాకింగ్.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందన.. పరిహారం ప్రకటన

For National News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 08:43 PM