Justice Gavai oath ceremony: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
ABN , Publish Date - May 14 , 2025 | 10:44 AM
Justice Gavai oath ceremony: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు (Supreme Court) 52వ ప్రధాన న్యాయమూర్తిగా (52nd CJI of India) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice Bhushan Ramakrishna Gavai) ప్రమాణం (oath ceremony) చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) జస్టిస్ గవాయ్తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు,గవర్నర్లు తదితరులు హాజరయ్యారు.
జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు.
Also Read: మహిళ గొంతు కోసి.. హత్య.. వీడిన మిస్టరీ..
2వేల సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా.. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా.. ఆ తరువాత నాగ్పూర్ బెంచ్లో ప్రభుత్వ లాయర్ అయ్యారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఇప్పుడు భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన పదవీకాలం 2025 నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది.
సీజేఐగా ప్రమాణ స్వీకారం..
ఈ వార్తలు కూడా చదవండి..
Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు
వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా
For More AP News and Telugu News