Home » Droupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి ఆదివారం సమావేశమైనట్టు రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఆ తర్వాత కొద్ది గంటలకు మళ్లీ రాష్ట్రపతి భవన్ మరో ట్వీట్లో హోం మంత్రి అమిత్షా రాష్ట్రపతిని కలుసుకున్నట్టు వెల్లడించింది.
నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై యావత్తు దేశం హర్షం వ్యక్తం చేసింది. యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న శుభాన్షు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త మైలురాయిని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు.
కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఉత్తరాఖండ్లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
Birthday Wishes: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
అభివృద్ధికి కేంద్ర బిందువుగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్’ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవశ్యకత గురించి నేతలు వివరించారు.