Home » Droupadi Murmu
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
అభివృద్ధికి కేంద్ర బిందువుగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్’ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవశ్యకత గురించి నేతలు వివరించారు.
రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఏళ్లతరబడి పెండింగ్లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
President Droupadi Murmu On Supreme Court: రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ అభిప్రాయాన్ని కోరారు.
రాష్ట్రపతి భవన్లో ఆర్మీ ఉన్నతాధికారులను తనను కలిసిన ఫోటోను రాష్ట్రపతి షేర్ చేశారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తనను కలుసుకున్నారని ఈ పోస్ట్లో రాష్ట్రపతి తెలిపారు.
Justice Gavai oath ceremony: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.
గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వాటి సవరణలు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంపబడతాయి
సుప్రీంకోర్టు గవర్నర్ల ద్వారా పంపిన బిల్లులపై రాష్ట్రపతికి మూడు నెలల గడువు నిర్ణయించింది. ఆలస్యం జరిగినట్లయితే, కారణాలు వివరించాలని చెప్పింది, గవర్నర్లకు మరియు రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం లేదని స్పష్టం చేసింది