Home » Droupadi Murmu
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది.
పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు.
పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.
పశ్చిమ బెంగాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో సంతల్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలని సూచించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు.
నేడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఇది ఏటా జరిగే ఒక ముఖ్యమైన రాజ్యాంగ, ఇంకా గౌరవప్రదమైన సాంప్రదాయం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.