Home » CJI
భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.
సీజేఐ జస్టిస్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్లో పర్యటించారు. 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్ఫెక్షన్ బారినపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే 'బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్- రాజ్యాంగ సభ-భారత రాజ్యాంగం' పేరిట ఒక పోస్టల్ కవర్ను విడుదల చేశారు.
తన కుమార్తెలు ప్రియాంక, మహిలకు ప్రతి రోజూ రెస్పిరేటరీ, న్యూరోలాజికల్ నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, పెయిన్ మేనేజిమెంట్ వరకూ వివిధ తరహాల్లో ఎక్స్ర్సైజ్ అవసరమవుతుందని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నివాసంతో బాత్రూంలతో సహా అన్నింటిని వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని వివరించారు.
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్ను వెంటనే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది.
రాజ్యాంగమే సర్వోన్నతమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలైన న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Justice Gavai oath ceremony: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. ఆయన న్యాయరంగానికి సేవలను కొనసాగిస్తానని చెప్పారు, తదుపరి సీజేఐ జస్టిస్ గవాయ్ మద్దతుతో తన సర్వసాధారణ సేవలను కొనసాగిస్తానని వెల్లడించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐగా ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు కట్టలు కనిపించిన విషయం సుప్రీంకోర్టు కమిటీకి నిర్ధారణైంది. ఆయనపై అభిశంసన జరపాలని సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.