Jungle Safari Train: ఇండియాలో ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ ప్రారంభం..రూట్, రేటు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 17 , 2025 | 09:56 PM
జంగిల్ సఫారీని ఆస్వాదించే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇండియాలో మొదటిసారిగా విస్టాడోమ్ కోచ్ పర్యాటక రైలును (India jungle safari train) ప్రారంభించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

మీకు జంగిల్ సఫారీ అంటే ఇష్టమా. అయితే దీనికోసం ఎక్కడికో వెళ్లాళ్సిన పనిలేదు. తాజాగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా విస్టాడోమ్ కోచ్తో కూడిన పర్యాటక రైలును (India jungle safari train) యూపీలో ప్రారంభించారు. దీనిని కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి దుధ్వా టైగర్ రిజర్వ్ వరకు ప్రవేశపెట్టారు. దేశంలోనే ఇది మొట్టమొదటి జంగిల్ సఫారీ రైలు. ప్రస్తుతం ఈ సేవను పర్యాటకులకు శని, ఆదివారాల్లో మాత్రమే అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిని వారంలోని అన్ని రోజులలో అందుబాటులో తీసుకురానున్నారు.
బయటి దృశ్యాలను..
ఈ పథకం కింద దుధ్వా జాతీయ ఉద్యానవనం, కతర్నియాఘాట్, కిషన్పూర్ వన్యప్రాణుల అభయారణ్యంలో నివసిస్తున్న వన్యప్రాణులను పర్యాటకులు ట్రైన్ ద్వారా అడవిలో తిరుగుతూ వారికి చూపించడానికి విస్టాడోమ్ కోచ్ను ప్రారంభించారు. దట్టమైన అడవి గుండా వెళుతున్న రైలులోని విస్టాడోమ్ కోచ్లో కూర్చున్న పర్యాటకులు అడవి పచ్చదనాన్ని చూడగలుగుతారు.
విస్టాడోమ్ కోచ్ అనేది పెద్ద కిటికీలు, పారదర్శక పైకప్పు కలిగిన రైలు కంపార్ట్మెంట్. దీనివల్ల ప్రయాణీకులు బయటి దృశ్యాలను ఈజీగా ఆస్వాదించగలుగుతారు. ఈ కోచ్లను భారత రైల్వే పర్యాటకం కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రయాణీకులకు ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
కోచ్లో కూర్చొని
విస్టాడోమ్ కోచ్ ద్వారా 107 కి.మీ పొడవైన అడవి గుండా ప్రయాణించేటప్పుడు పర్యాటకులు సహజ దృశ్యాలు, జీవవైవిధ్యం, వన్యప్రాణులను దగ్గరగా చూస్తూ అనుభవించగలుగుతారు. ఈ ప్రయాణం 4 గంటల 25 నిమిషాలపాటు కొనసాగుతుంది. కోచ్లో కూర్చొని జంగిల్ సఫారీని ఆస్వాదించడానికి ప్రతి పర్యాటకుని నుంచి రూ.275 రుసుము వసూలు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని దట్టమైన అడవుల దృశ్యాన్ని పర్యాటకులకు చూపించే ఈ రైలుకు బిచియా టూ మైలానీ టూరిస్ట్ స్పెషల్ (నం. 52259) అని పేరు పెట్టారు.
ఈ ట్రైన్ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ రైలు బిచియా స్టేషన్ నుంచి ఉదయం 11:45 గంటలకు బయలుదేరి వివిధ స్టేషన్ల గుండా ప్రయాణించి సాయంత్రం 4:10 గంటలకు మైలాని స్టేషన్ (లఖింపూర్ ఖేరి) చేరుకుంటుంది. ఈ రైలు ఉదయం 6:05 గంటలకు మైలానీ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు బిచియా చేరుకుంటుంది. ఈ రైలు బిచియా, మంజ్రా పుర్బా, ఖైరతియా డ్యామ్ రోడ్, టికునియా, బెల్రాయన్, దుధ్వా, పలియాకలాన్, భిరా ఖేరి అనే తొమ్మిది స్టేషన్ల గుండా వెళుతుంది. చివరకు మైలానీ స్టేషన్కు చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి
Tiranga Rally: ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీ..పాల్గొన్న కిషన్ రెడ్డి, ఉగ్రవాదులకు అడ్డగా హైదరాబాద్
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి