Kailash Mansarovar Yatra: కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ.. ఇండియా-చైనా కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 27 , 2025 | 09:28 PM
2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.

న్యూఢిల్లీ: ఇండియా-చైనా (India-China) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకునే దిశగా మరో ముందడుగు పడింది. 2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' (Kailash Mansarovar Yatra)ను పునరుద్ధరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri), చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి (Wang Yi) మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బీజింగ్లో మిస్రీ పర్యటిస్తు్న్నారు.
PM Modi: దేశ నిర్మాణంలో యువతకు స్ఫూర్తినిస్తున్న ఎన్సీసీ : మోదీ
''కైలాస్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి సీజన్ నుంచి ప్రారంభించాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. ఇరుదేశాలకు చెందిన నిపుణుల స్థాయి యంత్రాగం త్వరలోనే సమావేశమై ఇందుకు సంబంధించిన విధివిధానాలపై చర్చిస్తారు. దీనితో పాటు ఇరుదేశాల మధ్య నేరుగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై కూడా నిర్ణయం తీసుకుంటారు'' అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ 75వ స్వాంతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధణ, పరస్పర విశ్వాసాన్ని పాదుకొలిపేందుకు ఢిల్లీ-బీజింగ్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపింది.
కాగా, విక్రమ్ మిస్రీ తన బీజింగ్ పర్యటనలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులను, విదేశాంగ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ కార్యాలయ డెరెక్టర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంతర్జాతీయ విభాగం మంత్రి చైనా లియూ జియాన్చావోలను కలుసుకున్నారు.
Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం
India IST Now : ఇక నుంచి భారత్లో.. వన్ టైమ్.. వన్ నేషన్..
Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన
Read More National News and Latest Telugu News