Home » Yatra
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు రద్దీ పెరిగింది. మే 2న ఆలయ తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇంతవరకూ 6.5 లక్షల మంది కేదార్నాథ్ను దర్శించారు. గంగోత్రి, యమునోత్రి ధామ్లు అక్షయ తృతీయ పవిత్రదినాన తెరుకుకోవడంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా ఏప్రిల్ 30న ప్రారంభమైంది.
పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ బీజేపీ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది.
2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.
కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ..
దక్షిణ కశ్మీర్లోని పర్వతాల్లో భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే యాత్రికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది గత సంవత్సరం రికార్డును బద్దలుకొడుతూ సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 29 రోజుల్లో 4.51 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొని అమర్నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
కావడి యాత్ర ర్గంలోని హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానులు, సిబ్బంది పేర్లు పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు 'మధ్యంతర స్టే' ఇచ్చింది. విపక్షాలతో పాటు ఎన్డీయే కీలక భాగస్వామి జనతాదళ్ యూనైటెడ్ సైతం ఈ తీర్పును స్వాగతించింది.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో యాత్రికులకు బాగా తెలుసునని అన్నారు.
వార్షిక కన్వర్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు గాయపడ్డారు.