IAS, IPS: ఆ ఇద్దరికీ కీలక పోస్టింగ్లు..
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:55 PM
వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- కార్మిక శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ రోహిణీ సింధూరి
- బెంగళూరు టాస్క్ఫోర్స్ అధికారిగా రూపామౌద్గిల్
బెంగళూరు: వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రంపాషాను కేఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గాను శెట్టణ్ణనవర్ను బెళగావి రీజనల్ కమిషనర్గా బదిలీ చేశారు. కాగా సీనియర్ ఐపీఎస్ అధికారి రూపామౌద్గిల్(Roopamoudil)ను బెంగళూరు నగర టాస్క్ఫోర్స్ అధికారిగా నియమించారు.
కాగా.. రూపామౌద్గిల్ ఐజీ హోదా నుంచి ఏడీజీపీ స్థాయికి పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూపామౌద్గిల్ల మధ్య నెలకొన్న విభేదాలు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులను ఛీఫ్ సెక్రటరీ పిలిపించి మందలించారు. ఇద్దరు అధికారులు దాదాపు నాలుగేళ్ళుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News