Share News

Heavy Rains: భారీ వర్షాలతో ఐదుగురు మృతి.. పంట, ఆస్తి నష్టం

ABN , Publish Date - May 27 , 2025 | 01:10 PM

మహారాష్ట్రలో సోమవారం భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వచ్చిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. దీంతో ఇప్పటివరకు ఈ వానల కారణంగా ఐదుగురు మృతి చెందగా, పంట, ఆస్తినష్టం కూడా జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

Heavy Rains: భారీ వర్షాలతో ఐదుగురు మృతి.. పంట, ఆస్తి నష్టం
Maharashtra rain news

మహారాష్ట్రలో (Maharashtra) వర్షాలు (Heavy Rains) నిన్న దంచి కొట్టాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ప్రధానంగా ముంబై, థానే, పాలఘర్, కోంకణ్, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు, వంతెనలు నీట మునిగాయి. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 10 బృందాలను కోస్టల్, పశ్చిమ జిల్లాల్లోకి పంపింది. ముంబైలో మూడు బృందాలు, పాలఘర్‌లో ఒక బృందం, సొలాపూర్, సంగ్లీ, సత్తారా జిల్లాల్లో అదనపు బృందాలను మోహరించింది. ఆ క్రమంలో పుణె, సొలాపూర్, సత్తారా జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 48 మందిని రక్షించారు. ఖర్ఘర్‌లోని పాండవ కడా జలపాతంలో చిక్కుకున్న ఐదు మందిని కూడా కాపాడారు.


ఐదుగురు మృతి

అయినప్పటికీ ఈ వర్షాల కారణంగా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిడుగుపడి మరణించగా, ఒకరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో రాయగడ్ జిల్లా కర్జత్‌లో 30 ఏళ్ల రైతు రోషన్ కలేకర్, లాతూర్ జిల్లా అహ్మద్‌పూర్ తహసీల్లో రైతులు విక్రమ్ కరాలే, రంజనాబాయి సముదాయ్, కల్యాణ్‌లో 16 ఏళ్ల యువకుడు యశ్ లేట్, అంబెర్నాథ్‌లో 30 ఏళ్ల అవినాష్ భోయర్, దపోలి తహసీల్లో 48 ఏళ్ల రాజేంద్ర కొలంబే వంటి వారు ఉన్నారు. ఈ వర్షాలు మూడున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో వచ్చిన అత్యంత తొందర వర్షాలని నిపుణులు చెబుతున్నారు.


వరదలు,నష్టం

ఇదే సమయంలో రాయగడ్, రత్నగిరి, సాతారా, పుణె, సొలాపూర్, సత్తారా జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. ఉల్హాస్ నది బదలాపూర్ వద్ద, జగ్బుడి నది రత్నగిరి జిల్లాలో ప్రమాద స్థాయిని దాటాయి. ఈ కారణంగా ఆయా పరిధిలోని గ్రామాలు, ఆలయాలు, వ్యవసాయ భూములు నీట మునిగాయి. ఈ వర్షాలు నాసిక్ జిల్లా సిన్నార్ తహసీల్లో ఉల్లిపాయ రైతులకు భారీ నష్టాన్ని కలిగించాయి.

ముఖ్యమంత్రి సమీక్ష

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముఖ్య కార్యదర్శి సుజాత సౌనిక్‌తో కలిసి ఈ పరిస్థితిని సమీక్షించారు. రక్షణ, పునరావాస చర్యలు 24 గంటల పాటు కొనసాగించాలని ఆదేశించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకనాథ్ శిండే, విపత్తు నిర్వహణ మంత్రి గిరిష్ పలు ప్రాంతాలను సందర్శించారు. వరదల వేళ ప్రజలు ప్రయాణాలను తగ్గించాలని కోరారు. అత్యవసరం అయితే మాత్రమే బయటకు వెళ్లాలన్నారు. భద్రతా చర్యల కోసం స్థానిక పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం, సహాయక బృందాలు ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.


ఇవీ చదవండి:

మార్కెట్ మొత్తం రెడ్‎లోనే.. ఎంత నష్టపోయారో తెలుసా..

గుంపులోకి దూసుకెళ్లిన కారు..47 మందికి గాయాలు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 01:11 PM