Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిల్.. అయినా
ABN , Publish Date - May 20 , 2025 | 08:21 PM
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు (Gold Smuggling Case)లో ఇటీవల పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు బెంగళూరులోని ఆర్థిక నేరాలను విచారించే ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమెతో పాటు ఈ కేసులో మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజుకు కూడా షరతులపై బెయిల్ ఇచ్చింది. చెరో రూ.2 లక్షల పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో బెయిలు లభించినప్పటికీ ఇప్పటికిప్పుడు రన్యారావు జైలు నుంచి విడుదల కాకపోవచ్చు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కాఫిపోసో (COFEPOSA) కింద నమోదైన కేసులో ఆమెకు ఇంకా ఊరట లభించలేదు. ఈ కేసులో నిందితులను ఏడాది వరకూ బెయిల్ లేకుండా నిర్బంధంలోనే ఉంచే వీలుంది.
Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమా? కాంగ్రెస్పై సంబిత్పాత్ర నిప్పులు
కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 60 రోజుల్లోగా కోర్టుకు ఛార్జిషీటు దాఖలు చేయడంలో విఫలం కావడంతో రన్యారావు, రాజుకు మంగళవారంనాడు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని కోర్టు షరతులు విధించింది.
రన్యారావు మార్చి 3న దుబాయి నుంచి బెంగళూరు వస్తుండగా విమానాశ్రయంలో పట్టుబడ్డారు. రూ.12.56 కోట్లు విలువచేసే 14.2 కిలోల బంగారు కడ్డీలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాజు, బళ్లారి నగల వ్యాపారి సాహిల్ సకరియా జైన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటున్నారు. కాగా, కాఫిపోసా చట్టం కింద రన్యారావును నిర్బంధంలో ఉంచడాన్ని ఆమె తల్లి కర్ణాటక హైకోర్టులో ఈ నెల మొదట్లో సవాలు చేశారు. దీనిపై అభ్యంతరాలు తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన హైకోర్టు.. కేసు విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి