Maharashtra: నాసిక్లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:15 AM
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..

నాసిక్, జూలై 6: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. రామకుండ్ ప్రాంతంలోని దేవాలయాలు నీట మునిగిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో.. గోదావరి ఉప్పొంగి.. గోరారామ్-కాలారామ్ ఆలయం, ముక్తిధామ్, దుతొండియా ఆంజనేయుడి మందిరం(వరద హెచ్చరికగా భావించే ఆలయం)లో వరద కొనసాగుతోంది.