Mumbai: నీరవ్ ఫైళ్లు ఉన్న ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - May 06 , 2025 | 03:41 AM
ముంబై ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో కీలక ఆర్థిక నేర కేసులకు సంబంధించి పత్రాల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల దస్త్రాలు నాశనమై ఉండొచ్చని భావిస్తున్నారు

ముంబై, మే 5: దక్షిణ ముంబైలోని ఈడీ జోన్-1 కార్యాలయంలో ఏప్రిల్ 28 (ఆదివారం) అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక పత్రాల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు పది గంటల పాటు మంటలు వ్యాపించాయి. బల్లార్డ్ ఎస్టేట్లోని ప్రయివేటు భవనం కైసర్ ఎ హింద్లోని నాలుగో అంతస్తు, ఒకటో అంతస్తులోని కొంత భాగంలో ఈ కార్యాలయం నడుస్తోంది. నాలుగో అంతస్తులో అదనపు డైరెక్టర్ ఆఫీసు ఉంది. ఆర్థిక నేరగాళ్లు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, రాజకీయ నాయకులు ఛగన్ భుజబల్, అనిల్ దేశ్ముఖ్ వంటి ప్రముఖుల కేసుల ఫైళ్లు ఇందులోనే ఉన్నాయి. వాటిలో కొన్నయినా కాలిపోయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్లు, ఇతర పత్రాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..