Share News

Air India Plane Crash: మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:13 PM

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు. లండన్‌ ప్రయాణం కోసం ఆయన రెండు సార్లు విమాన టికెట్లు కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నారు.

Air India Plane Crash: మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్

న్యూఢిల్లీ, జూన్ 14: దాదాపుగా ప్రతిఒక్కరూ లక్కీ నెంబర్‌గా ఏదో ఒక సంఖ్యను పెట్టుకుంటారు. ఆ నెంబర్‌నే తమ వాహనాలకు సైతం పెట్టుకుంటారు. ఈ నెంబర్ తమకు చాలా బాగా కలిసొచ్చిందని అందరికీ చెబుతుంటారు. అయితే ఆ లక్కీ నెంబరే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణం తీసిందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయ్ రూపానీ లక్కీ నెంబర్ 1206. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా.. ఈ నెంబరే తన అధికారిక వాహనానికి పెట్టుకున్నారు. అలాగే ఆయన సొంత వాహనాలు.. కారు, స్కూటర్‌‌లకు సైతం ఇదే నెంబర్ వచ్చేలా ఆయన చూసుకున్నారు. అయితే ఆయన.. తన లండన్ ప్రయాణాన్ని సైతం లక్కీ నెంబర్ వచ్చేలా చూసుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా.. ఆ రోజు ప్రయాణమే ఆయనకు చివరి ప్రయాణం కావడం గమనార్హం.


రెండు సార్లు టికెట్ కొనుగోలు చేసి..

ఈ లక్కీ నెంబర్‌ రోజే ప్రయాణించాలని వరుసగా రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని మరీ రద్దు చేసుకున్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ కుమార్తె లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ రూపానీ భార్య ఇప్పటికే లండన్‌లో కుమార్తె వద్ద ఉన్నారు. దీంతో కుమార్తె వద్ద కొన్ని రోజులు ఉండి.. తిరుగు ప్రయాణంలో భార్యను తీసుకురావాలని మాజీ సీఎం విజయ్ రూపానీ భావించారు. అందులో భాగంగా తొలుత లండన్ వెళ్లేందుకు మే 19వ తేదీన ఆయన విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత దీనిని రద్దు చేసుకున్నారు.


నెంబర్ కలిసి వచ్చేలా..

అనంతరం జూన్ 5వ తేదీన లండన్ వెళ్లాలని ఆయన భావించారు. కానీ ఆ టికెట్‌ను సైతం ఆయన రద్దు చేసుకున్నారు. చివరగా తన లక్కీ నెంబర్ కలిసేలా జూన్ 12వ తేదీన ఆయన లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంటే 12/06వ తేదీ.. తన లక్కీ నెంబర్ కలుస్తుందని ఆయన భావించారు. దీంతో ఎయిర్ ఇండియా విమానంలో 12డీ నెంబర్‌ సీటును ఆయన ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే తన లక్కీ నెంబర్‌గా భావించిన రోజే ఆయన మరణించారు.


కొన్ని నిమిషాల్లోనే..

జూన్ 12వ తేదీ 1.38 గంటలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమాషాలకే కుప్ప కూలి మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు. ఈ విమానం మెడికో హాస్టల్‌పై కూలడంతో.. భోజనం చేస్తున్న మెడికోలు సైతం మరణించారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

త్వరలో అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా..

హాస్టల్‌పై పడ్డ విమానం.. వెలుగులోకి భయానక దృశ్యాలు..

For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 04:41 PM