Share News

DBT Drop: ప్రజల ఖాతాల్లోకి తగ్గుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ

ABN , Publish Date - May 06 , 2025 | 03:45 AM

ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం 2024-25లో రూ.6.77 లక్షల కోట్లు జమ చేసింది. గత మూడేళ్లతో పోలిస్తే ఇది తక్కువగా ఉండటానికి సబ్సిడీ కోతలు, నకిలీ లబ్ధిదారుల తొలగింపు ప్రధాన కారణాలిగా చెబుతున్నారు

DBT Drop: ప్రజల ఖాతాల్లోకి తగ్గుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ

న్యూఢిల్లీ, మే 5: వివిధ సంక్షేమ పథకాల కింద కేంద్రప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ విధానం(డీబీటీ) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రజల ఖాతాల్లో రూ.6.77లక్షల కోట్లు జమ చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇదే అతి తక్కువ. ఆహార, ఎరువుల సబ్సిడీల్లో కోత విధించడమే డీబీటీ నిధుల్లో తగ్గుదలకు ప్రధాన కారణం కాగా, సంక్షేమ పథకాల్లో నకిలీ లబ్ధిదారులను ఏరివేయడం, పథకాల పునర్వ్యవస్థీకరణ, సబ్సిడీ నిధుల సద్వినియోగం వల్లే డీబీటీ నిధుల్లో తగ్గుదల నమోదవుతోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కేంద్రంలోని 55మంత్రిత్వ శాఖల పరిధిలో 327పథకాలను డీబీటీ ద్వారా అమలు చేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో రూ.7.16లక్షల కోట్లు జమ చేసింది. అది 2023-24లో రూ.6.91లక్షల కోట్లకు, 2024-25లో రూ.6.77లక్షల కోట్లకు తగ్గింది.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:45 AM