Imposes No Fly Zone: రాజధానిలో ఉత్తర్వులు.. ఆగస్టు 16 వరకు వీటికి గగనతల నిషేధం
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:39 AM
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో ఈ వేడుకల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కీలక భద్రతా పరమైన నిబంధనలను ప్రకటించారు.

మన దేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం అయ్యాయి. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల నుంచి తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. మీ ఆలోచనలను MyGov పోర్టల్ లేదా NaMo యాప్ ద్వారా పంచుకోవచ్చు. ఇది ప్రజలు నేరుగా దేశ భవిష్యత్తు గురించి తమ ఆలోచనలను వ్యక్తం చేయడానికి వచ్చిన అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
ఢిల్లీలో గగనతల నిషేధం
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 16 వరకు గగన తలంలో అన్ని రకాల సబ్-కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్ఫామ్లపై నిషేధం (Delhi no fly zone) విధించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్బీకే సింగ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిషేధం కింద ఈ వస్తువులు వస్తాయి.
పారా-గ్లైడర్స్
పారా-మోటర్స్
హ్యాంగ్-గ్లైడర్స్
డ్రోన్స్ (UAVs, UASs)
మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్
రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్
హాట్ ఎయిర్ బెలూన్స్
చిన్న పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్
ఈ ఉత్తర్వులు 15 రోజుల పాటు అమలులో ఉంటాయి. అవసరమైతే ముందుగానే రద్దు కావచ్చు. ఈ భద్రతా చర్యలు ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవం సజావుగా, సురక్షితంగా నిర్వహించడానికి తీసుకున్న జాగ్రత్తలు.
ఎర్రకోట వద్ద సంప్రదాయం
స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15న, ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఇది ఆయనకు 12వ సారి వరుస స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసం కావడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ప్రధానమంత్రిగా మోదీ నిలుస్తారు.
2024 స్వాతంత్ర దినోత్సవం
గత సంవత్సరం 2024లో, మోదీ ఉపన్యాసం వికసిత్ భారత్ @2047 థీమ్పై ఉంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్ మ్యాప్ను ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి