Covid: కరోనా లక్షణాలుంటే క్వారంటైన్లో ఉండాల్సిందే..
ABN , Publish Date - May 22 , 2025 | 12:42 PM
కరోనా లక్షణాలున్నవారు క్వారంటైన్లో ఉంండాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసులు గతకొద్దరోజులుగా పెరుగుతున్న నేపధ్యంలో వైద్యఆరోగ్య శాఖ ఈ సూచన చేసింది. ఇదిలా ఇదిలా ఉండగా.. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటోంది.

చెన్నై: కరోనా లక్షణాలు నిర్ధారణ అయిన వారు వారం రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటోంది. దేశంలోను కరోనా వ్యాప్తి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. అదే సమయంలో, దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ తీవ్రం కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: మెరీనా సముద్రంలో సుడిగుండం.. స్నానాలను నిషేధించిన పోలీసులు
రాష్ట్రంలో చెన్నై సహా పలు నగరాల్లో రెండు వారాలుగా జ్వరం, దగ్గు, జలుబు తదితర సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒమైక్రాన్ రకం వైర్సగా మార్పు చెందిందని, స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచిస్తున్న వైద్యులు.. అలాంటి లక్షణాలు ఉన్న వారు వారంరోజులు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండాలని, జ్వర తీవ్రత అధికంగా ఉంటే ఆస్పత్రులకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
Read Latest Telangana News and National News