CJI Gavai: సీజేఐ గవాయ్కు అస్వస్థత.. ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:21 AM
సీజేఐ జస్టిస్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యూఢిల్లీ, జూలై 14: సీజేఐ జస్టిస్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన హైదరాబాద్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒకటి రెండు రోజుల్లో విధులకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న ఆయన హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు.