Centre opposes Celebi: టర్కీ సంస్థ సెక్యురిటీ క్లియరెన్స్ పునరుద్ధరణకు కేంద్రం నిరాకరణ
ABN , Publish Date - May 19 , 2025 | 09:21 PM
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో టర్కీ దేశం బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే బ్యూరో ఆఫ్ సెక్యూరిటీ అండ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్కూరిటీ నిర్వహణ అనుమతిని రద్దు చేసింది.

న్యూఢిల్లీ: సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టర్నీ సంస్థ సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, దాని అనుబంధ సెలెబి ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజిమెంట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వేసిన పిటిషన్లపై సోమవారంనాడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సెలిబి చేసిన విజ్ఞప్తితో కేంద్రం విభేదించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్థితిలో సెక్యురిటీ క్లియరెన్స్ను పునరుద్ధరించలేమని వివరించింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటరీ ప్యానల్కు విక్రమ్ మిస్రీ వివరణ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో టర్కీ దేశం బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే బ్యూరో ఆఫ్ సెక్యూరిటీ అండ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్కూరిటీ నిర్వహణ అనుమతిని రద్దు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా.. భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దీనిని గత శుక్రవారంనాడు సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను ఉదహరించినట్టు పేర్కొంది. ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టాలని హైకోర్టును కోరింది.
కాగా, జస్టిస్ సచిన్ దత్తా ముందు సోమవారంనాడు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపించారు. పిటిషనర్ కంపెనీల సేవలను కొనసాగించడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్నాయని అన్నారు. ''ఇది జాతీయ భద్రతా సమస్య. బీసీఏఎస్ ఆదేశాలు దీనినే ప్రతిబింబిస్తాయి'' అని మెహతా వాదించారు. సెలిబి సంస్థల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదన వినిపిస్తూ, కంపెనీల్లో టర్కీ షేర్హోల్టింగ్కు సంబంధించి ప్రజలు అనుకుంటున్న దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారే కానీ, ఇది సహేతుకం కాదని అన్నారు. 17 ఏళ్లుగా ఈ కంపెనీలు భారత్లో సేవలందిస్తున్నాయని, 14,000 మంది పనిచేస్తున్నారని చెప్పారు. వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా అనుమతులు రద్దు చేశారని వాదించారు. ఇరుపక్షాల వాదన విన్న జస్టిస్ దత్తా తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేశారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి