Share News

Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:57 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌ (REMP)కు రూ.7,280 కోట్లు కేటాయించిందని తెలిపారు. పుణె నగరంలో మెట్రో రైలు పొడిగింపునకు రూ.9,858 కోట్లు కేటాయించినట్లు వివరించారు. దేవభూమి ద్వారక - కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అందుకు రూ.1,457 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బద్లాపూర్ - కర్జాత్ థర్డ్, ఫోర్త్ రైల్వే పనులకు సైతం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ రోజు కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 19, 919 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.


మంబై సమీపంలోని బద్లాపూర్ - కర్జాత్ లైన్, గుజరాత్‌లోని ద్వారకా లైన్‌లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజం చేకూరుతుందన్నారు. అలాగే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. పుణే మెట్రోకు కేంద్రం రూ. 9,858 కోట్లు గ్రాంట్‌ను అందించనుందన్నారు. దీని ద్వారా 32 కిలోమీటర్ల మేర కొత్త లైన్ వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మార్గం ఖరడి నుంచి ఖడక్వాస్లా వరకు, నల్ స్టాప్ నుంచి మాణిక్ బాగ్ వరకు ఈ మెట్ర రైలు నడవనుందన్నారు. ట్రాఫిక్ జామ్‌తో నిత్య నరకం చూస్తున్న పుణే వాసులకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి.. స్వదేశంలోనే దీనిని అభివృద్ధి చేసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దాంతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌ (REMP) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. భారత్‌లో హైటెక్ మాగ్నెట్లను తయారు చేయడమే దీని లక్ష్యం. ఈ మాగ్నెట్లను ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హార్ట్ ఎటాక్ బాధితులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్..

వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు: డిప్యూటీ సీఎం సీఎం పవన్ కల్యాణ్

For More National News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 05:46 PM