Share News

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతిలో ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరా?

ABN , Publish Date - Mar 01 , 2025 | 06:07 AM

ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్‌సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతిలో ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్‌సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ప్రథమ భాషగా ఇంగ్లిష్‌, ద్వితీయ భాషగా హిందీ, ఐచ్ఛికభాషలుగా ప్రాంతీయ, విదేశీ భాషలు ఉండనున్నాయి. దీన్ని చూస్తుంటే ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరి భాషలుగా చదవాల్సి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇంగ్లిష్‌, హిందీ పరీక్షలకు నిర్ణీత తేదీలను కూడా ప్రకటించారు. మిగిలిన అన్ని భాషలకు ఒక్క రోజే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. దీని ప్రకారం హిందీ తప్పనిసరి అన్న అభిప్రాయం కలుగుతోంది.


ప్రాంతీయ భాషల జాబితాలో పంజాబీ లేకపోవడాన్ని అక్కడి ప్రభుత్వం ఎత్తిచూపింది. ఈ సందర్భంగానే ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరి సబ్జెక్టులా అన్న చర్చ తలెత్తింది. దీనిపై సీబీఎ్‌సఈ వివరణ ఇస్తూ ఇది ఖరారు చేసిన జాబితా ఏమీ కాదని తెలిపింది. తుది జాబితాలో అన్ని భాషలకు చోటు ఉంటుందని పేర్కొంది. ఇంగ్లి్‌షను ప్రథమ భాషగా, హిందీని ద్వితీయ భాషగా ఎందుకు పేర్కొన్నారనేదానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ ముసాయిదాపై మార్చి 9లోగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండడంతో మరికొన్ని రకాల సందేహాలు కూడా బోర్డు దృష్టికి వెళ్లే అవకాశం ఉంది.

Updated Date - Mar 01 , 2025 | 06:07 AM