G7 Summit: మోదీకి కెనడా ప్రధాని ఫోన్.. జీ-7కు ఆహ్వానం
ABN , Publish Date - Jun 06 , 2025 | 07:29 PM
శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయని మోదీ చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) శుక్రవారంనాడు ఫోన్ చేశారు. ఈనెల 15 నుంచి 17 వరకూ ఆల్బెర్టాలో జరుగనున్న జీ7 సదస్సుకు (G7 Sammit) హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఒక ట్వీట్లో తెలియజేశారు.
"కెనడా ప్రధాని మార్క్ జె కార్నే నుంచి ఫోన్ రావడం సంతోషంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సాధించిన విజయానికి అభినందనలు. ఈ ఏడాది ద్వీతీయార్థంలో కననాస్కిన్లో జరగనున్న జీ7 సదస్సుకు ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయనున్నట్టు చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
మార్క్ కార్నీ సారథ్యంలోని కెనడా ప్రభుత్వం జీ-7 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2019 నుంచి భారత ప్రధానిని ఫ్రాన్, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు జీ-7 సదస్సులకు ఆహ్వానిస్తు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు..
For More National News and Telugu News..