Share News

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు

ABN , Publish Date - Jun 15 , 2025 | 08:01 PM

ఇద్దరు సోదరులు కలిసి రూ. 2,676 కోట్ల భారీ స్కామ్ (Rs 2700 Crore Fraud) చేసి సంచలనం సృష్టించారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు కలిసి ఏకంగా 70,000 మందిని మోసం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు
Rs 2700 Crore Fraud

ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2,676 కోట్ల మేర స్కామ్(Rs 2700 Crore Fraud) చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 70,000 మందిని మోసం చేశారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు సోదరులు (Bizarre Brothers) గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో అనేక మంది నుంచి రూ.2,676 కోట్ల మేర నిధులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇది గృహ నిర్మాణం పేరుతో నిర్వహించబడిన మోసంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మోసపు పద్ధతులు

సుభాష్ బిజారిణియా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2014లో ధోలా సిటీలో అతను భూమి కొనుగోలు చేశారు. తరువాత, ఆయన సోదరుడు రణవీర్ బిజారిణియా కూడా అదే ప్రాంతంలో భూమి కొన్నారు. 2021లో ఈ ఇద్దరు కలిసి 'Nexa Evergreen' అనే కంపెనీని అహ్మదాబాద్‌లో నమోదు చేసుకున్నారు. ఈ కంపెనీ ధోలా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉందని, దాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.


కోట్లలో దందా

ఆ క్రమంలో పెట్టుబడిదారులకు, భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్ల వంటి రివార్డులు, కమీషన్లు వస్తాయని వారిద్దరూ పేర్కొన్నారు. పెట్టుబడిదారులను మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేక ఐడీల ద్వారా రిఫరల్ స్కీమ్‌లను కూడా అమలు చేశారు. ఈ మోసంలో సలీమ్ ఖాన్, సమీర్, దతార్ సింగ్, రక్షపాల్, ఓంపాల్, సంవర్మాల్ వంటి వ్యక్తులూ కీలకపాత్ర పోషించారు. వీరు రాజస్థాన్‌లో వేలాది మంది ఏజెంట్లను నియమించి రూ.1,500 కోట్ల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది.


వచ్చిన మొత్తంతో

వారు సేకరించిన నిధులతో 1,300 బిగ్హా భూమి, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్‌లో గ్రానైట్, మార్బుల్ మైన్లు, జైపూర్‌లో హోటల్, అహ్మదాబాద్‌లో ఫ్లాట్లు, ఆడీ, బీఎం‌డబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేశారు. మిగతా నిధులను 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. విషయం తెలిసిన రాజస్థాన్ పోలీసుల దాదాపు 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 24 చోట్ల దాడులు నిర్వహించి, రూ.2.03 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 10 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. కంపెనీ డైరెక్టర్లు సుభాష్, రణవీర్ బిజారిణియాలను అరెస్టు చేశారు.


పెట్టుబడిదారుల భవిష్యత్తు

రాజస్థాన్ పోలీసులు, ED అధికారులు ఈ మోసంలో నష్టపోయిన పెట్టుబడిదారులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. BUDS యాక్ట్ 2019 ప్రకారం, కంపెనీ ఆస్తులను సీజ్ చేసి పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కన్నప్ప సినిమాకు షాక్.. బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాటం సక్సెస్..


సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 08:48 PM