Share News

Bengaluru: టెక్కీ ఘాతుకం.. ప్రియురాలిపై 17 కత్తిపోట్లు..

ABN , Publish Date - Jun 09 , 2025 | 03:42 PM

సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది.

Bengaluru: టెక్కీ ఘాతుకం.. ప్రియురాలిపై 17 కత్తిపోట్లు..

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని ఓయో హోటల్‌ రూమ్‌లో దారుణం జరిగింది. ఓ టెక్కీ తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. కెంగేరి ప్రాంతంలోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. రెండ్రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. నిందితుడిని 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యశష్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.


సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుందని, హత్యకు ముందు ఈ విషయం అతనికి తెలియజేసిందని, అదే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నామని డీసీపీ (సౌత్) లోకేష్ బి.జగలసార్ తెలిపారు.


జూన్ 6న హత్య

ఓయో హోటల్‌లో జూన్ 6న ఈ హత్య జరిగింది. గడువు గంటే ఎక్కువ సమయం గది తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు. హత్య ఘటన వెలుగుచూడటంతో సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అనంతరం నిందితుడు యశష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

కంటైనర్ షిప్‌లో పేలుడు.. రంగంలోకి నేవీ

ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 03:53 PM