Share News

Bangladesh Plane Crash: స్కూలుపై కూలిన విమానం

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:29 AM

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు...

Bangladesh Plane Crash: స్కూలుపై కూలిన విమానం
Bangladesh Plane Crash

  • పైలట్‌ సహా 20 మంది దుర్మరణం.. వారిలో అత్యధికులు విద్యార్థులు

  • 171 మందికి గాయాలు

  • బంగ్లాదేశ్‌లో దుర్ఘటన

ఢాకా, జూలై 21: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్‌ సైన్యానికి చెందిన ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌(ఐఎస్‌పీఆర్‌) కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌ వాయుసేనకు చెందిన ఎఫ్‌-7బీజీఐ శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢాకా ఎయిర్‌ బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. కాసేపట్లోనే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తి.. 1.08 గంటల సమయంలో సమీపంలోని మూడంతస్తుల మైల్స్‌ స్టోన్‌ స్కూల్‌పై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఒక పైలట్‌ ఉన్నారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు.. మైల్స్‌ స్టోన్‌ బడిలోని ఇద్దరు ఉపాధ్యాయులు, 17 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో 171 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఐఎ్‌సపీఆర్‌ వివరించింది. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో పైలట్‌.. లెఫ్టినెంట్‌ మహమ్మద్‌ తౌఖీర్‌ ఇస్లాం ఉన్నారు. సాంకేతిక లోపంపై ఆయన ఏటీసీకి సమాచారం అందించారు. నిజానికి ఆ విమానం జనసమ్మర్థత అధికంగా ఉండే ప్రాంతంలో పడేది. కానీ, పైలట్‌ సమయస్ఫూర్తితో ఉత్తర ఢాకా వైపు మళ్లించారు’’ అని ఐఎ్‌సపీఆర్‌ వివరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:29 AM