Ayodhya: అయోధ్యలో వైభవంగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:47 AM
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది.

పూజలు నిర్వహించిన సీఎం యోగి
అయోధ్య, జూన్ 5: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. రామజన్మభూమి అయిన అయోధ్యలో 2024 జనవరిలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలయ మొదటి అంతస్తులోని రామ్ దర్బార్లో రాజారాముడి విగ్రహాలను నూతనంగా ప్రతిష్ఠించారు.
వాటితో పాటు, ఆలయ ప్రాంగణంలోని ఏడు ఉప ఆలయాల్లో కూడా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.