Share News

Air India Plane Crash: విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:01 PM

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. లండన్‌కు వెళ్తున్న ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 242 మంది చనిపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..

Air India Plane Crash: విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!
Air India Plane Crash

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. అందర్నీ తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలడంతో ఏకంగా 242 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో 169 మంది భారతదేశ పౌరులు కాగా.. 53 మంది బ్రిటన్‌వాసులు, అలాగే ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో విశ్వాస్ కుమార్ అనే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదం నుంచి మరో వ్యక్తి కూడా బయటపడ్డారు. ఆమె ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


కొద్దిలో మిస్..

ఆలస్యం అమృతం విషం.. అని పెద్దలు అంటుంటారు. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి, ఆలస్యం చేయొద్దని సూచిస్తుంటారు. అయితే ఈ ఘటన గురించి వింటే కొన్నిసార్లు లేట్ అవడం కూడా మంచిదేనని ఒప్పుకోక మానరు. లండన్‌లో ఉండే భూమి చౌహాన్ అనే మహిళ రెండేళ్ల తర్వాత ఈ మధ్యే భారత్‌కు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత తిరుగు ప్రయాణం కోసం ఆమె ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా జూన్ 12వ తేదీ (గురువారం) నాడు లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా ఏఐ-171కి టికెట్ బుక్ చేసుకుంది. అయితే విమానాన్ని ఆమె కొద్దిలో మిస్ అయింది. భూమి చౌహాన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలోపు విమానం అక్కడి నుంచి వెళ్లిపోయింది. 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్ అయింది భూమి. అయితే అది ఆమెకు మంచే చేసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఘోర ప్రమాదానికి గురైంది ఎయిరిండియా విమానం. దీనిపై భూమి స్పందిస్తూ.. భగవంతుడే తనను కాపాడాడని చెప్పింది.


5.jpg


వినాయకుడే కాపాడాడు..

‘దేవుడికి కృతజతలు. ఆ గణపతి బప్పానే నన్ను కాపాడాడు. విమాన ప్రమాద ఘటనను తలచుకుంటే భయమేస్తోంది. నా శరీరం ఇంకా వణుకుతోంది. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. ప్రమాదం గురించి తెలిసి నా మెదడు స్తంభించింది. 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్ అయ్యా. దయచేసి బోర్డింగ్‌కు అనుమతించాలని వేడుకున్నా. కానీ అధికారులు నన్ను రానివ్వలేదు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయా. 1.38 గంటలకు విమానం ప్రమాదానికి గురైంది. ఆ దేవుడే నన్ను కాపాడాడు’ అని చెబుతూ భూమి భావోద్వేగానికి లోనైంది.


ఇవీ చదవండి:

ఆ ఇద్దరికీ కీలక పోస్టింగ్‏లు..

పేపర్లో యాడ్.. మధ్యాహ్నం ప్రమాదం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:01 PM