Vijay: రెండో వారంలో విజయ్ ప్రజాయాత్ర..
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:03 AM
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ప్రజల చెంతకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మొత్తం 42 రోజుల పాటు ప్రజల్లో తిరగాలని ఆయన భావిస్తున్నారు.

- 42 రోజులకు ప్లాన్
చెన్నై: వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ప్రజల చెంతకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మొత్తం 42 రోజుల పాటు ప్రజల్లో తిరగాలని ఆయన భావిస్తున్నారు. స్టార్ హీరోగా ఉన్న విజయ్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రజల దగ్గరకు వెళ్ళాలని ఆయన భావిస్తున్నారు.
ఈ ప్రయాణం కూడా ఏకంగా 42 రోజుల పాటు సాగేలా ఆయన ప్రణాళిక రూపొందించుకున్నట్టు సమాచారం. జూన్ రెండో వారం లేదా ఆగస్టు మొదటి వారంలో దీన్ని ప్రారంభించాలని ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ ప్రయాణాన్ని తిరుచ్చి లేదా మదురై నుంచి ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనపై జిల్లా కార్యదర్శుల అభిప్రాయాన్ని ఆయన సేకరిస్తున్నట్టు వినికిడి.
అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ నేతల్లో ఏదైనా మనస్పర్థలున్నాయా? లేదా? అనే విషయంపైనా ఆరా తీసి, ఈ గొడవలకు ఫుల్స్టాఫ్ పెట్టాలని ఆయన అంతర్గతంగా ఆదేశించినట్టు వెల్లడించారు. 2026లో అనుకున్న లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు. అదేసమయంలో విపక్ష నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తూ, సమయాన్ని వృధా చేసుకోరాదని, మనకు లక్ష్యమే ముఖ్యమని విజయ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News