Morning Mood: ఉదయాన్నే చిరాగ్గా అనిపిస్తోందా.. ఇలా జరగడానికి కారణాలివే..
ABN , Publish Date - May 27 , 2025 | 09:24 AM
Morning Crankiness: ఉదయం నిద్ర మేల్కొగానే రోజును ఫ్రెష్గా, ఉత్సాహంగా ప్రారంభించాలి అనుకుంటారు ఎవరైనా. అప్పుడే రోజంతా ప్రశాంతంగా పనులపై దృష్టి సారించగలరు. అలాకాక నిద్ర మేల్కొన్న క్షణం నుంచి చిరాకు, అసహనం వంటి భావనలు కలుగుతుంటే.. అందుకు కారణాలివే అంటున్నారు సైకాలజిస్టులు.

Why Irritating Feeling After Wakeup: ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునేందుకు ప్రతి ఉదయం ఒక అవకాశం. మీ కలలు నిజం చేసుకుని జీవితాన్ని అనుకున్న విధంగా తీర్చిదిద్దుకునేందుకు లభించే వరం. ప్రశాంతమైన మనసుతో దినచర్య ప్రారంభించినపుడే లక్ష్యంపై ఒక స్పష్టత వస్తుంది. అలా కాకుండా జీవితం ఎటు సాగుతోందో తెలియని గందరగోళంతో, నిస్సహాయత, నిరాశ, చిరాకు వంటి లక్షణాలతో రోజును మొదలుపెడితే చివరికి మిగిలేది ఒత్తిడి, దాని వల్ల కలిగే దుఃఖం మాత్రమే. ఉదయాన్ని తాజాగా ప్రారంభించాలని అనిపిస్తున్నప్పటికీ చిరాగ్గా అనిపిస్తుంటే.. అందుకు కారణాలు ఇవే అంటున్నారు నిపుణులు.
ఉదయం పూట చిరాగ్గా అనిపిస్తోందా?
ప్రతి ఒక్కరికీ ఉదయం ఉత్తమ సమయం. అయినప్పటికీ కొంతమంది ఈ సమయాన్ని సంతోషకరంగా, ఉత్సాహంగా కాక చిరాకును అనుభవిస్తుంటారు. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని అంటున్నారు ఫిట్నెస్ కోచ్లు. అందులో ఒకటి ఉదయం పూట అల్పాహారం దాటవేయడం. నిజానికి మన మెదడు గ్లూకోజ్ వల్ల నడుస్తుంది. మెదడు పనిచేయడానికి రోజుకు 120 మి.గ్రా గ్లూకోజ్ అవసరం. సుదీర్ఘ నిద్ర తర్వాత అల్పాహారం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే మెదడుకు గ్లూకోజ్ సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల ఏ పనిపైనా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేక ఇబ్బంది పడతారు. అంతేకాకుండా, చిరాకుతో పాటు ఆందోళన కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదే సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేశారంటే మెదడుకు సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్లను తయారు చేయడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ రెండు హార్మోన్లూ మానసిక ఒత్తిడిని నియంత్రించేందుకు సహాయపడేవే. అదే మీరు అల్పాహారం తీసుకోకపోతే మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల చిరాకుగా అనిపించవచ్చు.
ఏమి చేయాలి?
ఉదయం పూట చిరాకును ఎదుర్కోవడానికి మేల్కొన్న గంటకే స్వల్ప మోతాదులో ఏదైనా తినండి. ఇలా చేయడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. భయాందోళన వంటి భావనలు మీ దరిచేరవు. ముఖ్యంగా ప్రోటీన్, ఓట్స్, గుడ్లు వంటి ఆహారాలను తినండి. అలాగే అరటిపండ్లు, కోకో వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. ఎందుకంటే ఇవి ప్రశాంతత, ఏకాగ్రత పెంచడానికి సహాయపడతాయి. ఇదే కాకుండా ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం 10 నిమిషాల పాటు సూర్యకాంతి తగిలేలా చూసుకోండి. ఇలా చేయడం ద్వారా బాడీ సైకిల్ రీసెట్ అవుతుంది. ఆందోళన, చిరాకు, అసహనం, నిరాశ, నిస్పృహ వంటి కుంగుబాటు లక్షణాలు శాంతిస్తాయి. ఇక ఉదయం సమయానికి అల్పాహారం తినే మహిళలు భావోద్వేగపరంగా స్థిరంగా, దృఢంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read:
నలుగురి దృష్టిలో పడాలంటే.. ఈ 4 టిప్స్ ఫాలో అవండి చాలు..
ఈ కారణాల వల్లే భార్యలు భర్తలను మోసగిస్తారు..
For More Lifestyle And Telugu News