Share News

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ ఘోర దాడి..4 ఎయిర్ పోర్టులు పూర్తిగా మూసివేత..

ABN , Publish Date - May 06 , 2025 | 05:03 PM

రష్యాతో వివాదం కొనసాగుతున్న వేళ.. ఉక్రెయిన్ తాజాగా డ్రోన్ల దాడి చేసి మాస్కోపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 100 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించి, రష్యా భూభాగంలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ ఘోర దాడి..4 ఎయిర్ పోర్టులు పూర్తిగా మూసివేత..
Ukraine Launches Drone Attack

రష్యాతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఈసారి ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్ (Ukraine Drone Attack) దాడికి పాల్పడింది. ఈ క్రమంలో మంగళవారం ఉక్రెయిన్ 100 కంటే ఎక్కువ డ్రోన్లతో రష్యాలోని అనేక ప్రాంతాలపై ఎటాక్ చేసింది. ఈ క్రమంలో పలు డ్రోన్లను రష్యన్ సైన్యం అడ్డగించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడి కారణంగా, మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇది కాకుండా, రష్యాలోని మరో తొమ్మిది ప్రాంతీయ విమానాశ్రయాలలో కార్యకలాపాలు కూడా కొంతకాలం నిలిచిపోయాయి.


సెలవు రోజు చూసుకుని

నాజీ జర్మనీపై విక్టరీ డే అయిన మే 9న రష్యా విజయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరగడం విశేషం. ఈ రోజు రష్యాలో ప్రధాన ప్రభుత్వ సెలవు. దీంతో అనేక మంది విదేశీ నాయకులు కూడా మాస్కోను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మే 8 నుంచి 72 గంటల పాటు ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ ఆలోపే ఉక్రెయిన్ మెరుపు దాడి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. ఈ దాడి నేపథ్యంలో రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


పలువురికి గాయాలు

రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఉక్రేనియన్ డ్రోన్ దాడులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలను, రష్యా లోపలి భాగాన్ని తాకాయి. ఈ క్రమంలో కుర్స్క్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వొరోనెజ్ ప్రాంతంలో కొంత నష్టం జరిగినట్లు సమాచారం. మరోవైపు రష్యా కూడా రాత్రిపూట 20 ఇరాన్ నిర్మిత షాహిద్ డ్రోన్‌లతో ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన బరాబషోవాలో మంటలు చెలరేగాయి. ఖార్కివ్ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో డ్రోన్లు, బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు గాయపడ్డారు.


కొనసాగుతున్న ఉద్రిక్తత

అమెరికా నిరంతరం కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఒకవైపు ఉక్రెయిన్ అమెరికా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించగా, మరోవైపు రష్యా కాల్పుల విరమణకు తనదైన షరతులను విధించింది. ఆ తర్వాత, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు.


ఇవి కూడా చదవండి:

MG Windsor EV Pro: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్..ఒక్క సారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్..


Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్


ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..


Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం


Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 05:30 PM